హైదరాబాద్ లో కలకలం.. 100 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..!

-

హైదరాబాద్ లో తాజాగా మరో డ్రగ్‌ రాకెట్‌ గుట్టు రట్టయింది. నగర శివారులో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. వారు జరిపిన దాడుల్లో 250 కిలోల మత్తు మందును పట్టుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 50 కోట్ల విలువైన రా మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ నుంచి ముంబైకి కార్గో బస్సులో మత్తు మందు రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డీఆర్‌ఐ అధికారులు కార్గో బస్సుని వెంటాడి పట్టుకున్నారు.  అయితే 2017లో అరెస్టయిన డ్రగ్‌ డీలరే ఇప్పుడు మళ్లీ పట్టుబడటం విశేషం. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news