ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ కీల‌క నిర్ణ‌యం.. ఆర్టీసీలో ఈడీలు, ఆర్ఎంల బ‌దిలీలు

-

ఆర్టీసీ ఎండీ సజ్జ‌నార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. టీఎస్ ఆర్టీసీలో బ‌దిలీల కార్యక్ర‌మం చేప‌ట్టారు. ఆర్టీసీలో ఎగ్జీక్యూటీవ్ డైరెక్ట‌ర్లను, రీజ‌న‌ల్ మేనేజ‌ర్ల‌ను బ‌దిలీ చేశారు. అందుకు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను టీఎస్ ఆర్టీసీ ఎండీ స‌జ్జనార్ సోమ‌వారం జారీ చేశారు. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం.. టీఎస్ ఆర్టీసీలో న‌లుగురు ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్లు, 11 మంది రీజిన‌ల్ మేనేజ‌ర్లును ఎండీ స‌జ్జ‌నార్ బ‌దిలీ చేశారు. కాగ టీఎస్ ఆర్టీసీ నష్టాల్లో నుంచి బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి ఎండీ స‌జ్జనార్ అనేక నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. తాజా గా బ‌దిలీల కార్య‌క్ర‌మాన్ని కూడా చెప్పట్టారు.

కాగ బదిలీ అయిన ఈడీల వివ‌రాలు ఇలా ఉన్నాయ‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఆప‌రేషన్స్ ఈడీగా ఉన్న ఇ.యాదగిరిని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోనల్‌ ఈడీగా నియమితులయ్యారు. అలాగే గ్రేట‌ర్ హైద‌రాబాద్ జోన‌ల్ ఈడీ గా ఉన్న వి.వెంకటేశ్వర్లు కరీంనగర్‌ జోన్‌ ఈడీగా బదిలీ అయ్యారు. దీంతో పాటు హైదరాబాద్‌, కరీంనగర్‌ జోన్ల ఈడీగా పనిచేస్తున్న పీవీ మునిశేఖర్‌ పరిపాలనా వ్యవహారాల ఈడీ, కార్పొరేషన్‌ కార్యదర్శిగా బ‌దిలీ అయ్యారు. ఆర్టీసీ రెవెన్యూ, ఐటీ వ్యవహారాల ఈడీగా ఉన్న ఎ.పురుషోత్తంను హైదరాబాద్‌ జోన్‌ ఈడీగా బదిలీ అయ్యారు. అలాగే ఇంజినీరింగ్‌ వ్యవహారాల ఈడీగా ఉన్న సి.వినోద్‌కుమార్‌కు అదనపు బాధ్య‌త‌లుగా ఉప్పల్‌, కరీంనగర్‌ వర్క్‌షాపులను ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news