కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం..వచ్చేది బీజేపీ సర్కారే – ఈటల

-

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం..వచ్చేది బీజేపీ సర్కారే అని ఈటల రాజేందర్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో రైతులు ధనిక రైతులుగా చేస్తానంటూ ఆచరణలో మాత్రం శూన్యమని… రైతులకు ఎం ఎస్ పి ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు. అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యాన్ని కొని రైతులను ఆదుకోవాలి.పంట పెరిగినపుడు పంట విస్తీర్ణం పెరిగినపుడు రైస్ మిల్లింగ్ కూడా పెరగాలి,మిల్లింగ్ మిషనరీ సబ్సీడీ కూడా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

నిన్నటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఆచరణ లేని హామీలు అని… గతంలో టి ఆర్ ఎస్ పార్టీ ఆచరణ కానీ హామీ ఇచ్చి ఇబ్బంది పెడుతుందని ఫైర్‌అయ్యారు. కెసిఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా నన్న హామీ ఇప్పటికి నెరవేర్చలేదని… కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నేను వ్యతిరేకిస్తలేను విమర్శిస్తలేను కానీ సాధ్యం కానీ హామీలు అని పేర్కొన్నారు. ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ ఆచరణలో కానీ పని అని… రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వచ్చు నేను వ్యతిరేకించనని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news