ఈటల రాజేందర్ పార్టీ మార్పుపై ఆయన భార్య క్లారిటీ

-

గత కొద్ది రోజులుగా హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పార్టీ మారబోతున్నారంటూ పెద్ద ఎత్తున న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈటెల పార్టీ మార్పు పై స్పందించారు ఆయన భార్య ఈటల జమున. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈటెల బిజెపిలోనే ఉన్నారని, పార్టీలో సంతృప్తిగా ఉన్నారని స్పష్టం చేశారు. పదవి కోసం తలవంచుకోవడం తమ రక్తంలోనే లేదన్నారు జమున.

ఓటు వేసేది ప్రజలు అని.. ప్రజలు అనుకుంటే ఎవరైనా గెలుస్తారని అన్నారు. తాను పార్టీ మారను అని ఇప్పటికే రాజేందర్ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. ఇక తాను ప్రత్యక్ష రాజకీయాలలోకి రానని కూడా క్లారిటీ ఇచ్చారు. కొందరు కేసీఆర్ మెప్పు పొందేందుకు ఏదేదో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో కూడా కొందరు చిల్లరగాళ్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version