పార్టీ మీటింగ్ ను బోనాలతో పోల్చడం ఏంటి – ఈటెల రాజేందర్

-

పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని విజయ సంకల్ప సభ పై మంత్రి తలసాని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. డబుల్ ఇంజన్ సర్కారులో ఏ రాష్ట్రాల్లో అభివృద్ధి సాగుతోందని పేర్కొన్నారు. సింగిల్ ఇంజన్ సర్కారు తోనే అన్నీ అభివృద్ధి చేస్తున్నామని, నిన్నటి బీజేపీ సభలో మా బల్కంపేట టెంపుల్ కి వచ్చిన అంత మంది రాలేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అయితే తలసాని వ్యాఖ్యలపై బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. బోనాలకు వచ్చినంత జనాలు రాలేదని రాష్ట్రమంత్రులు మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమన్నారు.

అసలు పార్టీ మీటింగ్ ని బోనాలతో పోల్చడం ఏంటని ఆయన నిలదీశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు ఈటెల. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని జేపీ నడ్డా సూచించినట్లు తెలిపారు. బీజేపీ సమావేశాల సమయంలో ప్రజల సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు ఏర్పాటు చేసుకుని వెకిలి ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news