హిందూ ధర్మం కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటాం – రాజాసింగ్ సతీమణి

-

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి టి. ఉషా భాయి ఈరోజు ఓ ప్రకటన… విడుదల చేశారు. రాజాసింగ్ లో ప్రవహించేది కాషాయ రక్తమేనని.. హిందూ ధర్మం కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశం కోసం , ధర్మం కోసం నిరంతరం కష్టపడి పనిచేసే రాజాసింగ్ గారు అదే ధర్మం కోసం జైళ్లో ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ సమయంలో హిందూ సమాజం, బీజేపీ కార్యకర్తలు, రాజాసింగ్ అభిమానులంతా మాకు అండగా ఉంటూ ధైర్యాన్ని ఇచ్చారని తెలిపారు.

రాజాసింగ్, ఆయన కుటుంబం అనాథ కాదు. ఇంత పెద్ద హిందూ సమాజం మాకు అండగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజాసింగ్ పేరు చెప్పుకుంటూ కొందరు కుట్రలు చేస్తూ సొంత రాజకీయ లబ్ది కోసం ఆయనను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నారు. హిందుత్వ పేరుతో కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి వారిపట్ల పార్టీ కార్యకర్తలు, రాజాసింగ్ గారి అభిమానులు జాగ్రత్తగా ఉండాలి. రాజాసింగ్ గారు ధర్మం కోసం ఎన్ని రోజులైనా జైల్లో ఉండేందుకు సిద్ధంగా ఉన్నారు.

రాజాసింగ్ కు జైళ్లు, కేసులు కొత్త కాదన్నారు. రాజాసింగ్ గారు క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త. రాజాసింగ్ చేతిలో ఉండేది కమలం జెండానే.. ఆయనలో ప్రవహించేది కాషాయ రక్తమే…ధర్మ రక్షణ కోసం రాజాసింగ్ గారు ఎన్ని బాధలు, కష్టాలు భరించడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం సంఘటితంగా ఉండాలి. ధర్మం పేరుతో కొందరు చేస్తున్న కుట్రలను తిప్పికొడదామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news