తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్..నేటితో ముగియనున్న గ్రూప్‌-4 గడువు

-

తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్. నేటితో గ్రూప్‌-4 గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలోనే, గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. గడువు ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 58,845 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు.

దీంతో ఇప్పటివరకు అందిన మొత్తం దరఖాస్తుల సంఖ్య 8,00,004 కి చేరింది. సోమవారం చివరిరోజు కావడంతో ఉద్యోగార్థులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సర్వర్ పై ఒత్తిడి అనూహ్యంగా పెరిగింది. దరఖాస్తు ఫారం పూర్తి చేశాక ఫీజు చెల్లింపులో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. అయితే, గ్రూప్‌ 4 పరీక్ష గడువు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ కేసీఆర్‌ సర్కార్‌ దానికి సుముఖంగా లేదు. కాగా, ఏప్రిల్/ మే నెలలో గ్రూప్ 4 ఎగ్జామ్ ఉండనున్నట్లు ప్రకటించారు. TSPSC నుండి అతి పెద్ద నోటిఫికేషన్ ఇదేనని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news