రైతులకు హరీష్‌ రావు శుభవార్త..రుణాలపై కీలక ప్రకటన

-

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు రైతులకు శుభవార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కరెంటు, నీళ్లు, రైతుబంధుతో పాటు కొత్తగా బ్యాంకుల ద్వారా సులభతరంగా రుణాలు పొందేందుకు, అలాగే రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న రైతులు రుణ విముక్తులు అయ్యేలా వన్ టైమ్ సెటిల్మెంట్ సువర్ణావకాశమని, ఈ సదవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి పిలుపునిచ్చారు.

సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం బ్యాంకర్లతో సమీక్షా సమావేశం జరిపారు. ఈ సమీక్షలో బ్యాంకు రుణ విముక్తికై వన్ టైమ్ సెటిల్మెంట్ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామీణ ప్రాంత రైతుల వ్యవసాయ రుణాలను అన్నీ బ్యాంకులు తప్పనిసరిగా రెన్యువల్ చేయాలని బ్యాంకర్లకు మంత్రి ఆదేశించారు.ముంపునకు గురైన రైతుల భూములకు సంబంధించి వారి రుణాల విషయంలో బ్యాంకులు ప్రత్యేక పథకాలు రూపొందించి, వారిని రుణ విముక్తి చేసేలా బ్యాంకర్లు కార్యాచరణ రూపొందించాలని బ్యాంకర్లకు మంత్రి హరీశ్ సూచించారు.

జిల్లా వ్యాప్తంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఏపీజీవీబీ, టీజీబీ బ్యాంకులలోని రైతులకు రుణ విముక్తి కలుగనున్నదని మంత్రి వెల్లడి. వివిధ బ్యాంకుల నుంచి ఓటీఎస్ స్కీమ్ కింద 12 శాతం నుంచి 50 శాతం వరకూ మొండి బకాయిలు ఉండి, క్రాప్ లోన్ తీసుకుని తిరిగి కట్టలేక పోయిన వారికి నాలుగు బ్యాంకుల నుంచి వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకునే వెసులుబాటు కలిగిందని పేర్కొన్న మంత్రి.ఈ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, ఇందు కోసం బ్యాంకర్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఏఈఓలు, పంచాయతీ అధికారులు, ఏంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఏంపీఓ, అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు మేలు కలిగేలా చొరవ చూపాలని మంత్రి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news