కాంగ్రెస్ నేతల నోటికి మొక్కాలి – హరీష్ రావు సెటైర్లు

-

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై స్పందించారు మంత్రి హరీష్ రావు. ఆదివారం సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు డిక్లరేషన్ మీద డిక్లరేషన్ చేస్తున్నారని.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో మొదట డిక్లరేషన్ చేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో 1000 రూపాయల పింఛన్ మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో మాత్రం అంత ఇస్తాం, ఇంత ఇస్తాం అని నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ నేతల నోటికి మొక్కాలని ఎద్దేవా చేశారు. వాళ్లు తెలంగాణలో వచ్చేది లేదు, సచ్చేది లేదని విమర్శించారు. బండి సంజయ్ కూడా జిహెచ్ఎంసి ఎన్నికలలో బండి పోతే బండి ఇస్తాం అన్నారని.. కానీ ఇప్పటివరకు బండి లేదు, గుండు లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు అయితే పడనీ.. హామీలు ఎగబెట్టుదాం అని చూస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్, బిజెపిల మాటలు నమ్మితే ఎండమావులకు ఆశపడ్డట్టు అవుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version