మూసీ నదికి తగ్గిన వరద.. మూసారాంబాగ్ బ్రిడ్జిపై భారీగా పేరుకుపోయిన బురద

-

హైదరాబాద్ లో గత వారం రోజులుగా భారీ వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే… మూసీ నదికి భారీగా వరదలు వచ్చాయి. అయితే.. తాజాగా మూసీ నదికి వరద తగ్గింది. దీంతో మూసారాంబాగ్ బ్రిడ్జిపై భారీగా పేరుకుపోయింది బురద.

రాత్రి నుంచి వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు పరివాహక ప్రాంతాల ప్రజలు. వరద ప్రవాహం తగ్గడంతో.. మూసారాంబాగ్ బ్రిడ్జిపై భారీగా బురద, చెత్త, రాళ్లు పేరుకుపోయాయి. నిన్న బ్రిడ్జిపై నుంచి పొంగి ప్రవహించింది మూసీ. దీంతో చెత్త చెదారం తొలగింపులో నిమగ్నమయ్యారు జీహెచ్ఎంసీ కార్మికులు. మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ మల్లింపు ఇంకా కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news