జూబ్లీహిల్స్ లో భారీగా కోకైన్ పట్టివేత

-

గచ్చిబౌలిలోని జూబ్లీహిల్స్ లో భారీగా కొకైన్ పట్టుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డిసిపి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. నిందితులు గోవాలో డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ కి తీసుకువచ్చి విక్రయిస్తున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ లోని అనురాధ, ప్రభాకర్ రెడ్డి, సాయి ఇళ్లలో సోదాలు నిర్వహించగా 51.45 గ్రాముల కొకైన్, 44 ఎండిఎంఏ, 8 గ్రాములు పిల్స్ గుర్తించినట్లు తెలిపారు.

 

వారి వద్ద నుండి ఐదు మొబైల్ ఫోన్లు, 97 వేల నగదు సీజ్ చేసి మూడు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనురాధ అనే మహిళ నైజీరియా కు చెందిన జేమ్స్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. గోవాలో డ్రగ్స్ కొనుగోలు చేసి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకు వచ్చినట్లుగా గుర్తించారు.

వీరు నగరంలో వాట్సాప్, స్నాప్ చాట్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ డ్రెస్ ఎవరెవరు సేవిస్తున్నారు అనే సమాచారాన్ని సేకరిస్తున్నారు పోలీసులు. కేవలం వీరు సేవించడానికి మాత్రమే ఈ డ్రెస్ తీసుకువచ్చారా..? లేక డ్రగ్స్ ని ఎవరికైనా విగ్రహిస్తున్నారా అనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news