హైదరాబాద్ అఘాయిత్యాలకు అడ్డాగా మారింది: దాసోజు శ్రవణ్

-

హైదరాబాద్ అఘాయిత్యాలకు అడ్డాగా మారిందని మండిపడ్డారు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నోరు తెరవడం లేదని శ్రవణ్ మండిపడ్డారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో ట్విటర్ లో పనికిమాలిన అంశాలపై స్పందించే కేటీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని అన్నారు.

దిశ ఘటనలో నిందితుల వివరాలు నిమిషాల్లో బయటపెట్టిన పోలీసులు జూబ్లీహిల్స్ ఘటనకు సంబంధించిన వివరాలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కొడుకు ఘటనా స్థలంలో లేడని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ చెప్పాగా.. తాజాగా సి వి ఆనంద్ ఎమ్మెల్యే కొడుకు కారు దిగి వెళ్ళిపోయాడు అని చెప్పడాన్ని తప్పుబట్టారు.

బాధితురాలి తండ్రి మే 31న ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసేందుకు ఏడు రోజుల సమయం ఎందుకు పట్టింది అని ప్రశ్నించారు.సోషల్ మీడియాలో వీడియో వైరల్ కాకపోయి ఉంటే కేసు నుంచి ఎమ్మెల్యే కొడుకును తపించేవారని అన్నారు. డ్రగ్, పబ్ కల్చర్ కట్టడికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news