హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్..బయటకు రావొద్దని ఆదేశాలు

-

తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురువనున్నాయి. ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరంలో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఇప్పుడు వాయువ్య & ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా ఒడిశా మరియు ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరం వద్ద ఉంది. దాని యొక్క అనుబంధ ఉపరితల ఆవర్తనం 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుతో నైరుతి దిశగా వంగి ఉంది. వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనం ఒడిశా మరియు ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలేవకాశం ఉంది.

ఋతుపవనాల ద్రోణి ఇప్పుడు సముద్ర మట్టం వద్ద జైసల్మేర్, నుండి వాయువ్య & ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడన ప్రాంత కేంద్రం ఒడిశా మరియు ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరం మరియు ఆగ్నేయ దిశగా ఉత్తర అండమాన్ సముద్రం వరకు ఉంది. దీని ఫలితంగా రాగల మూడు రోజులలో తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ, అత్యంత భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అవకాశం ఉంది. ఇక హైదరాబాద్‌ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇవాళ వాహనదారులు బయటకు రావొద్దని హెచ్చరించింది. హైదరాబాద్‌ లోనూ ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news