జగన్ కు హైడ్రా నోటీసులు… రంగనాథ్ క్లారిటీ !

-

తెలంగాణలో హైడ్రా రోజు రోజుకు  స్పీడ్ పెంచుతోంది. హైదరాబాద్ నగర పరిధిలో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే FTL పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఇవాళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ కి నోటీసులు అంటూ వార్తలు వినిపించిన విషయం విధితమే.

ఈ విషయం పై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఏపీ మాజీ సీఎం జగన్ కి నోటీసులు అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ఎవరో కావాలనే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ కి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని  GHMC, హైడ్రా అధికారులు వెల్లడించారు. ఇక ఇది సోషల్ మీడియా ట్రాష్ అంటూ స్పందించారు హైడ్రా కమిషనర్ AV రంగనాథ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version