టీఆర్ఎస్ జోలికి వస్తే…కుక్కల్ని కొట్టినట్టు కొడతాం – మంత్రి ప్రశాంత్ రెడ్డి

-

టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంటికి వెళ్తే మిమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొడుతామన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. రాజసింగ్ విషయంలో చట్ట ప్రకారం స్పీకర్ వ్యవహరిస్తారని అన్నారు. కవిత ఇంటి దగ్గర బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేయడం మంచిది కాదన్నారు ప్రశాంత్ రెడ్డి. లిక్కర్ పాలసీ పై బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం, ఆ తరవాత బీజేపీ కార్యకర్తలు కావాలని ప్రొటెస్ట్ చేయటం ఒక స్కెచ్ వేసుకొని వచ్చారని ఆరోపించారు.

కేసీఆర్ సూటిగా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. చట్టానికి లోబడి పనులు చేయాలి,కానీ బీజేపీ అంటేనే సీబీఐ,ఈడీ అన్నట్టు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ లో ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారని.. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 20 వేల ఈడీ దాడులు జరిగాయన్నారు. ఈడీ దాడులు జరగ్గానే బీజేపీలోకి తీసుకుంటున్నారని అన్నారు ప్రశాంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news