కుప్పంలో అల్లర్లు అదుపు చేయకపోతే.. జగన్‌ ఇల్లు ముట్టడిస్తాం – అచ్చెన్నాయుడు

-

కుప్పంలో అల్లర్లు అదుపు చేయకపోతే.. జగన్‌ ఇల్లు ముట్టడిస్తామని అచ్చెన్నాయుడు వార్నింగ్‌ ఇచ్చారు. సీఎం జగన్ దుర్మార్గుడు,ఫ్యాక్షనిస్ట్ అని.. రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నా టీడీపీ తిప్పికొడుతుందని హెచ్చరించారు. 175 కి 175 టీడీపీ గెలవబోతుంది… అందుకే సీఎం జగనుకి పిచ్చి ఎక్కిందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తుంటే పోలీసులు జాగ్రత్తలు తీసుకోలేదు.. చంద్రబాబుని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.అన్న కాంటీన్ పెడుతుంటే దాన్ని ధ్వంసం చేశారు.. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేస్తే జగన్ పాదయాత్ర చేసేవాడా అని నిలదీశారు.

జగన్ కు పిచ్చి ముదిరింది.. సీఎం పిచ్చి పరాకాష్టకు చేరి చంద్రబాబు పర్యటన అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ లేకుండా అల్లకల్లోలం సృష్టిస్తున్నారని.. చంద్రబాబు కాన్వాయి పై రాళ్లెస్తే ఒక రేటు.. దాడి చేస్తే ఒక రేటు ఇచ్చి వైసీపీ కార్యకర్తలను ఉసికొల్పుతున్నారని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు అచ్చెన్నాయుడు. జెడ్ ప్లస్ భద్రతలో ఉండే చంద్రబాబునే ఈ విధంగా చేయడం ఏంటి..? అని ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news