విద్యార్థుల భవిష్యత్తుకు మాది బాధ్యత : మంత్రి శ్రీధర్ బాబు

-

గత ప్రభుత్వం పదేళ్లలో 40 వేల ఉద్యోగాలివ్వలేదు. కానీ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 50 వేల పై చిలుకు ఉద్యోగాలు ఇచ్చాము అని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.గ్రూప్ 1 పరీక్షకు ముందు విద్యార్థులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ పరీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. గడిచిన పదేళ్లలో టెక్నికల్ వ్యవస్థలు మూలనపడ్డాయి. ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం పై ప్రత్యేకమైన శ్రద్దగా పెట్టింది.

పాలమూరులో రెండు అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తున్నాం. పాలమూరులో స్కిల్ యూనివర్సిటీ విభాగం ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్యాలు అందిస్తాం. గత ప్రభుత్వం యూనివర్సిటీలకు వీసీలను నియమించలేదు. యూనివర్సిటీలో ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటు ద్వారా పరిశ్రమలు అనుసంధానం చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. టాటా టెక్నాలజీస్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పిస్తాం. 33 కోర్సులను ప్రక్షాళన చేసి విద్యార్థులకు అందిస్తాం. బీఏ, బీకాం చదివే విద్యార్థులకు బ్యాంకింగ్, పైనాన్షియల్ కోర్సులను జోడించి నైపుణ్యం కల్పిస్తాం. విద్యార్థుల పరిశోధనలకు తోడ్పాటునందిస్తాం. పారిశ్రామీకరణకు విద్యను అనుసంధానం చేస్తాం. విద్యార్థుల భవిష్యత్తుకు మాది బాధ్యత అని చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు పాలమూరు జిల్లా సీఎం జిల్లా.. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version