రేవంత్‌ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొడుతుందనే భయంతో కాంగ్రెస్‌లో చేరా – కడియం శ్రీహరి

-

రేవంత్‌ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొడుతుందనే భయంతో కాంగ్రెస్‌లో చేరానని హాట్‌ కామెంట్స్‌ చేశారు కడియం శ్రీహరి. ప్రతిపక్ష పార్టీలను బీజేపీ వేధిస్తుంది. ఇతర ఎమ్మెల్యేల మీద, ప్రతిపక్ష పార్టీల నాయకుల ఈడీ, సీబీఐ కేసులు పెట్టి ప్రభుత్వాలను కూలగొట్టి అధికారం చలాయించాలని చూస్తుంది అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు కడియం శ్రీహరి.

Kadiyam Srihari and Kadiyam Kavya join Congress

కేసీఆర్ ను ఒక్క మాట కూడా తిట్టను.. ఆయన అవకాశాలు ఇచ్చారన్నారు కడియం శ్రీహరి. ఇవాళ కడియం శ్రీహరి మాట్లాడుతూ…బీఆర్ఎస్ పార్టీని వీడడం కొంత బాధగానే ఉంది…కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం ఉంది.. కేసీఆర్ గారిపై నేను ఏ రకమైన విమర్శలు చేయదలచుకోలేదని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ నాకు అవకాశాలు ఇచ్చింది.. నేను ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకున్నాను అని గుర్తు చేశారు కడియం శ్రీ హరి.ఎఐసిసి ప్రతినిధుల పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాము…వరంగల్ నుంచి కడియం కావ్యకి పోటీ చేసే అవకాశం కల్పించిన సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version