కాళేశ్వరం డిజైన్ ఒకటి.. చేసింది మరొకటి : రేవంత్ రెడ్డి

-

కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన విషయం తెలిసిందే. ఇవాళ తాజాగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో పలు సంచలన విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా కాళేశ్వరానికి కర్త, కర్మ క్రియ అన్ని తానే అన్నారు కేసీఆర్. నేనే ఆలోచన చేసి రక్తం ధార పోసి కాళేశ్వరం కట్టానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంతో సాంకేతిక నిపుణుల మీద తోస్తున్నారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి అంచనాలు 38,500 కోట్లు అయితే.. లక్షా 51వేల కోట్లకు పెంచారని రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులను వారి పదవుల నుంచి తప్పించాలి.

కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంకా 50 శాతం పనులు పూర్తి కాలేదని వెల్లడించారు. కేంద్రప్రభుత్వం దీనిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదు. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం బలైపోయింది. మేడిగడ్డ డొల్లతనాన్ని కాంగ్రెస్ బయటపెట్టిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి దేశంలో మరెక్కడా జరగలేదన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news