BREAKING : ప్రగతి భవన్‌కు కవిత.. సీఎం కేసీఆర్‌తో భేటీ

-

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో 160 సీఆర్‌పీసీ కింద వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది సిబిఐ. కేవలం వివరణ కోసం మాత్రమే నోటీసు ఇచ్చినట్లు సీబీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్సీ కవిత భేటీ కానున్నారు.

ఆమె కాసేపట్లో ప్రగతి భవన్ కు బయలుదేరనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడి, సిబిఐ కేసులపై కేసీఆర్ తో ఆమె చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఆరవ తేదీన తన ఇంటి వద్ద విచారణకు హాజరవుతారని కవిత సిబిఐకి రిప్లై ఇచ్చిన నేపథ్యంలో కెసిఆర్ తో భేటిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు కవిత ఇంటి దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news