వారితో కలిసి తిరుపతికి వెళ్లిన కవిత సమాధానం చెప్పాలి – రఘునందన్ రావు

-

ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక ఆరోపణలు చేశారు. అభిషేక్ రావు, రామచంద్ర పిల్లై, సృజన్ రెడ్డిలు తెలియదని చెప్పిన ఎమ్మెల్సీ కవిత.. మరి వాళ్లతో కలిసి కెసిఆర్ పుట్టినరోజున తిరుపతికి ఎలా వెళ్లారో తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. దానికి సంబంధించిన ఫోటోను ఆయన మీడియాకు చూపించారు. లిక్కర్ స్కామ్ లో తనకు సంబంధం లేదన్న కవిత.. వారితో కలిసి వెళ్లడం అబద్దమా అని ప్రశ్నించారు.

ఈడి సోదాలు జరిపిన నేపథ్యంలో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని.. వాటినే తాను ఉటంకిస్తున్నానని.. కవిత పై తనకు ఎలాంటి వ్యక్తిగత కోపం లేదంటూ రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఇంగ్లీష్ దినపత్రికలో ప్రచురితమైన వార్త, ఫోటోలను చూపిస్తూ ఎమ్మెల్సీ కవిత దీనిపై సమాధానం ఇవ్వాలంటూ ఆయన విలేకరుల సమావేశంలో కోరారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ ( ఈడి) మంగళవారం దేశవ్యాప్తంగా 32 ప్రాంతాలలో సోదాలు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news