BREAKING : మునుగోడు బై పోల్..నేడు నామినేషన్ వేయనున్న కోమటి రెడ్డి

-

తెలంగాణ రాజకీయాలు మొత్తం మునుగోడు చుట్టూనే తిరుగుతున్న విషయం తెలిసిందే. మునుగోడు ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ రాష్ట్ర ప్రజలకు బాగా ఉంది. సాధారణ ఎన్నికల ముందు జరగనున్న ఈ ఉపఎన్నికలో ఏ పార్టీ సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, బి‌జే‌పిలు తమ తమ అభ్యర్ధులతో నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశాయి. ఇక ఇవాళ మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. నామినేషన్‌ వేయనున్నారు. కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా.. ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నామినేషన్‌ ప్రక్రియ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జరుగనుంది. కాగా, నవంబర్‌ 3వ తేదీన ఈ ఉప ఎన్నిక జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news