మేం తెలంగాణ బిడ్డలం కాదా – కోమటిరెడ్డి

-

మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం ఎంతో.. బస్వాపూర్ భూనిర్వాసితులకు ఇచ్చిన పరిహారం ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మేము తెలంగాణ బిడ్డలము కాదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి బస్వాపూర్ భూనిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

వాస్తు సరిగా లేదని 650 కోట్లతో కొత్త సెక్రటేరియట్ కట్టుకుంటున్న సీఎం కేసీఆర్ కి భూ నిర్వాసితులకు ఇచ్చేందుకు మాత్రం 350 కోట్లు లేవా అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో బెదిరించైన పనులు చేయించుకున్నామని. కానీ ఇప్పుడు ఏ పనులు జరగడం లేదన్నారు. బసవపూర్ ప్రాజెక్టు పేరుతో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇసుక దందా చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news