వరంగల్ తూర్పు నుంచే కొండా సురేఖ పోటీ

-

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సంచలన ప్రకటన చేశారు. తన భార్య కొండా సురేఖ పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. ఎవరు ఎన్ని మాట్లాడిన వరంగల్ తూర్పు నుంచే… కాంగ్రెస్ పార్టీ తరఫున కొండా సురేఖ పోటీ చేస్తుందని వెల్లడించారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.

వరంగల్ నగరంలోని లేబర్ కాలనీలో బి ఆర్ ఎస్ మరియు బీజేపీ పార్టీ లకు చెందిన కొంతమంది కార్యకర్తలు కొండ మురళి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికార పార్టీ నాయకులు తమ కార్యకర్తల జోలికి వస్తే ముందు సిపికి ఫిర్యాదు చేస్తామని.. తర్వాత ఏసీపి కి ఫిర్యాదు చేస్తాం, తర్వాత సిఐ తర్వాత ఎస్సై తర్వాత కానిస్టేబుల్ అయినా న్యాయం జరగకుంటే క్రేనుకు కట్టేసి తమ ప్రతాపం చూపిస్తామన్నారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. కొంతమంది నాయకులు కొండ మురళి పని అయిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని.. తమ సత్తా ఏంటో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చూపిస్తామని తేల్చి చెప్పారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news