బండి సంజయ్ తప్పుడు ప్రమాణాలు చేస్తే నరసింహస్వామి పేగులు తీసి మెడలో వేసుకుంటారు – కూనంనేని

-

మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో టిఆర్ఎస్ బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ బహిరంగ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఎం తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. మునుగోడు అడ్డా.. కమ్యూనిస్టుల గడ్డ అని అన్నారు. టిఆర్ఎస్, కమ్యూనిస్టులు కలిసిన తర్వాత మనకు ఎదురేలేదన్నారు కూణంనేని. రాజగోపాల్ రెడ్డి కమ్యూనిస్టులపై అవకుల చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ ధర్మం గురించి మాట్లాడితే ధర్మమే సిగ్గుతో తలదించుకుంటుందని.. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బిజెపి స్టార్ క్యాంపైనర్ అని ఏద్దేవా చేశారు. బండి సంజయ్ దొంగ ప్రమాణాలు చేయవద్దని.. తప్పుడు ప్రమాణాలు చేస్తే లక్ష్మీనరసింహస్వామి పేగులు తీసి మెడలో వేసుకుంటారని హెచ్చరించారు. స్వాములకు ఫామ్ హౌస్ లో ఏం పని అని ప్రశ్నించారు. ఇది తెలంగాణ.. ఇక్కడ మోడీ, అమిత్ షా ఆటలు సాగవన్నారు. నరేంద్ర మోడీని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు కూనంనేని.

Read more RELATED
Recommended to you

Latest news