తెలంగాణకు ప్రధాని మోడీ, బీజేపీ అవసరమే లేదు – కేటీఆర్

-

తెలంగాణకు ప్రధాని మోడీ, బీజేపీ అవసరమే లేదని మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను మోదీ ప్రభుత్వం దారుణంగా ఉల్లంఘించినందుకు తెలంగాణకు చెందిన నలుగురు వెన్నెముక లేని బీజేపీ ఎంపీలు బాధ్యత వహించాలని ఫైర్‌ అయ్యారు.

తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు…కానీ ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు మాత్రం 20,000 కోట్ల లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ అని మండిపడ్డారు. గుజరాతీ బాసుల చెప్పులు మోసే దౌర్బాగ్యులను ఎన్నుకున్న ఫలితం అన్నారు. ప్రధాని మోడీ ప్రాధాన్యతల్లో.. అసలు తెలంగాణే లేనప్పుడు… తెలంగాణ ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని మోడీ ఎందుకు ఉండాలి..? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఆ దిక్కుమాలిన బీజేపీ పార్టీ ఎందుకుండాలి.?? అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news