తెలంగాణ వదిలి వెళ్లిపోవాలి..లేకపోతే తరిమికొడతాం – కూనంనేని హెచ్చరిక

-

తమిళ్ సై తెలంగాణ వదిలి వెళ్లిపోవాలి..లేకపోతే త్వరలో పెద్ద ఎత్తున రాజ్ భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. తెలుగు మూలాల గల ముఖ్యమంత్రి తమిళ బాషా మాట్లాడుతున్నారు.. నల్లులు జలగాళ్ల మాట్లాడుతున్నారని గవర్నర్ ఎద్దవా చేస్తూ మాట్లాడారని నిప్పులు చెరిగారు.

తెలంగాణ లో మంత్రులను నా ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నానని గవర్నర్ అన్నారని ఫైర్ అయ్యారు. మీరు గవర్నర్ ఆ..బీజేపీ కార్యకర్తనా.. ముందు తేల్చాలన్నారు. తమిళనాడు, కేరళ,ఢిల్లీ, తెలంగాణ లో గవర్నర్ ల తీరు సరిగా లేదు…అసలు ఈ గవర్నర్ ల వ్యవస్థ సరిగా లేదని నిప్పులు చెరిగారు.

బ్రిటిష్ కాలం నుండి వచ్చిన ఈ గవర్నర్ వ్యవస్థ ని రద్దు చేయాలని… మేము మా జాతీయ మహాసభ ల్లో కూడా తీర్మానం చేసామని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ తెలంగాణ కు రావద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం..10 వ తేదీ నుండి బొగ్గు కర్మాగారంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు కూనంనేని సాంబశివరావు.

Read more RELATED
Recommended to you

Latest news