నేడు ఎల్బీనగర్ వద్ద పైవంతెన ప్రారంభోత్సవం

-

హైదరాబాద్ లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉదయం ఆఫీసు 9 గంటలకంటే 7 గంటలకే ఇంటి నుంచి బయల్దేరాల్సిన పరిస్థితి. కొన్నిసార్లు  అంత ముందుగా బయల్దేరినా ఆలస్యం అవుతుంది. కారణం నగర ట్రాఫిక్. ఇక సాయంత్రం పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 5 గంటలకు ఆఫీసు నుంచి బయల్దేరితే ఇంటికి వెళ్లే సరికి కనీసం 7 అవుతుంది. కొన్నిసార్లు రాత్రి 9 దాటిన దాఖలు కూడా ఉన్నాయి.

ట్రాఫిక్ తో నగర వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మెట్రో, ఫ్లైఓవర్స్, స్కై సిటీస్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా రద్దీ ఎక్కువగా ఉండే ఎల్బీనగర్‌లో ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు ప్రభుత్వం పైవంతెనను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఎల్బీనగర్ వద్ద ఇవాళ సాయంత్రం నుంచి మరో పైవంతెన అందుబాటులోకి రానుంది. వనస్థలిపురం- దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలో ఎల్బీనగర్‌ కూడలి వద్ద నిర్మించిన పైవంతెనను మంత్రి కేటీఆర్‌ సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా ఎల్బీనగర్‌ కూడలిని సిగ్నల్‌ ఫ్రీగా మార్చేందుకు  రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ వివరాలను మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news