అమెరికాలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం

-

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మహబూబ్​నగర్ జిల్లా యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటనతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం కప్పెటకు చెందిన బోయ వెంకట్రాములు, శకుంతల దంపతుల పెద్ద కుమారుడు మహేశ్‌(25) బీటెక్‌ పూర్తిచేసి, ఎంఎస్‌ చదివేందుకు గతేడాది డిసెంబరు 29న అమెరికాలోని మిన్నెసోటా వెళ్లాడు.

మంగళవారం రోజున స్నేహితులతో కలిసి మహేశ్‌ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో మృత్యువాత పడ్డాడు. కారులో ఉన్న మహేశ్‌ స్నేహితులు ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహేశ్‌ మృతి విషయాన్ని స్నేహితులు ఆయన తండ్రి వెంకట్రాములుకు మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఫోన్‌ చేసి తెలిపారు.

బాగా చదువుకుని తమకు అండగా నిలుస్తాడనుకున్న కుమారుడు ప్రమాదంలో మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మహేశ్‌ మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అమెరికాలోని ఆటా సంస్థ ప్రతినిధులకు విన్నవించారు.

Read more RELATED
Recommended to you

Latest news