చిరంజీవి ఆంధ్రోడు కాదు.. తెలంగాణ బిడ్డ : తెలంగాణ మంత్రి

-

మెగాస్టార్‌ చిరంజీవిది ఆంధ్రా కాదని… తెలంగాణ వాడేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణలో ఉన్న సినిమా బిడ్డలంతా ఈ రాష్ట్రానికి చెందిన వారేనని స్పష్టం చేశారు. కాబోయే నిర్మాతలు, ఓటీటీ ఓనర్లు ఇక నుంచి కార్మికులేనని… నా లాంటి వాళ్లను భాగస్వాములను చేసి ఓటీటీ లు పెట్టుకోవాలని కోరారు. సైకిల్ మీద పాలమ్ముకున్న నేను ఈ రోజు కార్మిక శాఖ మంత్రినయ్యానని.. కార్మికుల కోసం చిరంజీవి సినిమాలు తీయాలి, ఓటీటీలు పెట్టాలని పేర్కొన్నారు.


కార్మికుల పక్షాన చిరంజీవి నిలబడాలని.. సినీ కార్మికులకు ధనవంతులను చేసే బాధ్యతను చిరంజీవి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నేను ఓటీటీ సినిమాలు తీస్తా, స్టూడియోలు కడుతానని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలమైందని.. కరోనా వల్ల నిర్మాతలకు డబ్బులు తక్కువగా వచ్చాయని పేర్కొన్నారు. కానీ కార్మికులు బాగా నష్టపోయారని… సినిమా కార్మికులంతా ఇప్పుడు అదృష్టవంతులు అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news