నేడు హైదరాబాద్ కు మల్లికార్జున ఖర్గే !

-

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక రేసులో చివరకు మల్లికార్జున ఖర్గే, శశితరూర్ పోటీ పడుతున్నారు. ఎన్నో మలుపుల తరువాత వీరిద్దరి మధ్య పోటీ నెలకొంది. అయితే ఖర్గే ఎన్నిక లాంచనమే అని కాంగ్రెస్ వర్గాలు ఇప్పటికే చెబుతున్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లికార్జున శనివారం హైదరాబాద్ కి రానున్నారు. నేడు మధ్యాహ్నం ఆయన గాంధీభవన్ లో టీపీసీసీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

తెలంగాణకు చెందిన నాయకులందరూ దాదాపుగా మల్లికార్జున కు మద్దతుగా నిలుస్తుండడంతో ఈ సమావేశానికి పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు హాజరవుతారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకుగాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు కీలక నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ సమావేశాన్ని విజయవంతం చేసే బాధ్యతను మాజీ ఎంపీ మల్లు రవి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news