మాయ మాట‌లు చెప్పి బాలిక‌పై సామూహిక అత్యాచారం

-

మాయ మాట‌లు చెప్పి న‌మ్మించి ఓ బాలిక‌ను ఇద్ద‌రూ యువ‌కులు క‌లిసి తీసుకెళ్లారు. ఆ త‌రువాత బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఎస్సార్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. బోరబండ ప్రాంతంలోని ఓ కాల‌నీలో నివాసం ఉండే బాలిక (17) వారిది పేద కుటుంబం కావ‌డంతో చెత్త ఏరుకుంటూ జీవిస్తుంటుంది.

రాత్రి స‌మ‌యంలో పాల ఫ్యాకెట్ తీసుకొచ్చేందుకు స‌మీపంలో ఉన్న దుకాణం వ‌ద్ద‌కు వెళ్లింది. ఆ స‌మ‌యంలో అదే బ‌స్తీకి చెందిన శివ‌(22) ఆ బాలిక‌కు మాయ మాట‌లు చెప్పి స‌మీపంలో ఉన్న‌టువంటి బ‌స్తీలో కార్మికుడిగా ప‌ని చేస్తున్న మిత్రుడు సాయి (20) గ‌దికి తీసుకెళ్లాడు. దీంతో వారిద్ద‌రూ క‌లిసి బాలిక‌పై సామూహికంగా అత్యాచారం చేశారు. బాలిక తెల్ల‌వారుజామున త‌ప్పించుకుని ఇంటికి వెళ్లి త‌ల్లికి విష‌యం చెప్పింది. దీంతో వెంట‌నే ఎస్సార్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుల‌ను అరెస్ట్ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news