రైతుల ఆత్మహత్యలకు కారణం BRS..!

-

వికారాబాద్ జిల్లా తాండూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. వీరి ఆధ్వర్యంలో తాండూర్ వ్యవసాయ కమిటీ చైర్మన్, బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు ప్రమాణస్వీకారం చేసారు. అంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో అవాకులు చేవాకులు పేలడం తప్ప ప్రతిపక్ష నాయకులు చేసిందేమీ లేదు అని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చేసుకోవడానికి BRS ప్రభుత్వమే కారణం అని అన్నారు.

అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ఇద్దరు కేంద్ర మంత్రులున్న రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారు అని స్పహతం చేసారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్రానికి 18 లక్షల పైచిలుక ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీఎం రాజశేఖర్ రెడ్డి మంజూరు చేశారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news