గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమావేశం..!

-

గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసారు. GHMC కమిషనర్, నగర పోలీస్ కమిషనర్, రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారులు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. అలాగే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కూడా పాల్గొన్నారు.

విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఎక్కడా ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేసారు. మండపాలు ఏర్పాటు చేసుకునే వారంతా పోలీసులకు ఇన్ఫామ్ చేయాలని.. సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలు పెట్టాలని మండపాల నిర్వాహకులకు మంత్రి పొన్నం సూచనలు చేసారు. అలాగే జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి మట్టి విగ్రహాల పంపిణీపై కూడా ఆరా తీశారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version