ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఎమ్మెల్సీ కవిత ప్రస్తావన

-

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ కేసులో అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్ళై బెయిల్ పిటిషన్ పై నేడు ఢిల్లీ కోర్టులో విచారణ జరిగింది. అయితే రామచంద్ర కి బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడి తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత పేరును వాదనలలో చేర్చింది ఈడి.

రామచంద్ర, కవిత మధ్య సమావేశాలు జరిగాయని.. ఫీనిక్స్ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, బుచ్చిబాబు హైదరాబాద్ లో ఆస్తులు కొన్నారని తెలిపింది. తమ వాదన వినిపించేందుకు రామచంద్రతరపు న్యాయవాది సమయం కోరడంతో ఈ కేసును జూన్ 2వ తేదీకి విచారణ వాయిదా వేసింది ధర్మాసనం.

Read more RELATED
Recommended to you

Latest news