ప్రధాని మోడీ దుర్మార్గుడు, అసలు ఎవడు నడ్డా : మంత్రి నిరంజన్‌ రెడ్డి

-

ప్రధాని మోడీ దుర్మార్గుడు, అసలు ఎవడు నడ్డా అంటూ మంత్రి నిరంజన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ రాష్ట్రం రాజకీయ పార్టీలకు ప్రయోగశాల కాదని.. నిన్న నడ్డా , నేడు రాహుల్ కోసం ఇది అడ్డా కాదని నిప్పులు చెరిగారు. వీళ్ళ పాలన నచ్చకనే ఇక్కడ ప్రజలు టీఆరెస్ కు పట్టం కట్టారని.. ఇక్కడికి వచ్చి వెక్కిలి చేష్టలు చేస్తున్నారన్నారు. అసలు బీజేపీకి ఇక్కడ స్థానమే లేదని.. దక్షిణ భారతదేశం లో అసలు బిజెపి చోటు లేదని చురకలు అంటించారు.

కర్ణాటక లో సైతం దిగజారుడు రాజకీయాలు చేసి అధికారం లోకి వచ్చారని… తెలంగాణ లో బిజెపి పాత్ర తోడు పెళ్లి కొడుకు పాత్రనేనని ఎద్దేవా చేశారు. ఎవడు నడ్డా అసలు …ఇక్కడి నాయకులూ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారు.. కేంద్రం లో మీ ప్రభుత్వమే ఉంది కదా ..తెలంగాణ అవినీతి అంటున్నారు ఆధారాల తోచర్యలు తీసుకోండని డిమాండ్‌ చేశారు. అసలు ప్రధాని ఎవరు ., అడుగడుగున తెలంగాణ అవమానించిన దుర్మార్గుడు కదా ..? రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించలేదా అని ఆగ్రహించారు. రాహుల్ సారధ్యాన్ని వాళ్ల పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారని.. కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్షుని పాత్ర రోడాలి పాత్ర అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news