మరో నెల రోజుల్లో పెళ్లి…. అంతలోనే డ్యూటీలో ఉన్న డాక్టర్ అనుమానాస్పద మరణం

-

నిజామాబాద్ జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. డ్యూటిలో ఉన్న డాక్టర్ రెస్ట్ రూమ్ లో డాక్టర్ శ్వేతా అనుమానాస్పదంగా మరణించారు. రాత్రి వరకు డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ శ్వేత ఒక్కసారిగా బెడ్ పైమ కుప్పకూలిపోయినట్లు అనుమానిస్తున్నారు. దీంతో డాక్టర్ మరణంపై పోలీసులు విచారణ చేపట్టారు. శ్వేతా రెడ్డిది స్వస్థలం కరీంనగర్ జిల్లా. మరో నెల రోజుల్లో పెళ్లి ఉందనే సమయంలో మృతి చెందడంతో విషాదం చోటు చేసుకుంది. అయితే పని ఒత్తడా… లేక మరే ఇతర కారణాల ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది.

అయితే ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ మాట్లాడుతూ.. డాక్టర్ శ్వేతా చాలా యాక్టివ్ అని ఆమె మరణం మమ్మల్ని షాక్ కు గురి చేసిందని వెల్లడించారు. నిన్న స్నేహితులతో కలిసి డిన్న చేసిందని.. ఆ తరువాత రెస్ట్ తీసుకోవడానికి వెళ్లి కుప్పకూలిందని ఆమె తెలిపారు. అయితే డాక్టర్ శ్వేతకు రెండు సార్లు కరోనా బారిన పడ్డారని…కోవిడ్ రిలేటెడ్ హార్ట్ స్ట్రోక్ వల్లే ఆమె చనిపోయిందని అనుమానిస్తున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news