కేసీఆర్​ను గద్దెదించే ప్లాన్​ వేస్తున్నాం : పొంగులేటి శ్రీనివాస్​

-

మూడో సారి అధికారంలోకి రావాలని చూస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ను గద్దె దించేందుకు సరికొత్త ప్రణాళిక రచిస్తున్నామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికార పార్టీ అవినీత.. అహంకార ధోరణికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెబుతారని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే తెంలగాణలోనూ పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా కలిసి వచ్చే నేతలతో.. సమీకరణాలు కొనసాగుతున్నాయని, తాము ఏ పార్టీలో చేరబోతున్నామో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వనపర్తిలో పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మ గౌరవ సభకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు, ఆవేదనలు మిగిలాయే తప్ప అమరవీరుల ఆశయాలు నెరవేరలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news