ఖమ్మం రాజకీయాల్లో పొంగులేటి ఒక బచ్చా: మంత్రి పువ్వాడ

-

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం రోజున ఖమ్మం జిల్లాలో కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కేసీఆర్ సర్కార్, కల్వకుంట్ల కుటుంబం, మంత్రి పువ్వాడపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. పొంగులేటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డబ్బు బలం చూసుకుని విర్రవీగుతున్నారని మంత్రి పువ్వాడ మండిపడ్డారు. ఏ పార్టీలోకి పోవాలో తేల్చుకోలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు ఓ సిద్ధాంతం, విలువలు అనేవి లేవి విమర్శించారు. పొంగులేటి తనను తాను కాస్త అతిగా ఊహించకుంటున్నారని.. ఆ ఊహలో నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిదని హితవు పలికారు.

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఒక బచ్చా అని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. పేదలను పీడించిన దోపిడీ దారులే పొంగులేటి పంచన చేరారని.. కాంట్రాక్టులు చేసుకుని ఒక్కడు బాగుపడితే జిల్లా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news