కాసేపట్లో సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మరికాసేపట్లో సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించనుంది. బీహెచ్ఈఎల్ చౌరస్తా నుంచి ముత్తంగి వరకు మొదటి రోజు సంగారెడ్డి జిల్లాలో ఈ పాదయాత్ర కొనసాగనుంది. రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈరోజు రాత్రి 7 గంటలకు ముత్తంగిలో రాహుల్ కార్నర్ మీటింగ్ జరగనుంది.

ఇక నిన్న రాత్రి రాహుల్ గాంధీ యాత్ర పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ చేస్తున్న జోడోయాత్రను సక్సెస్ చేయడానికి, యాత్ర నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లకు తన దగ్గర డబ్బులు లేవంటూ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ అప్పు చేసి అయినా సరే భారత్ జోడో యాత్రను సక్సెస్ చేద్దామనుకుంటే తనకి ఎవరూ అప్పు ఇవ్వడం లేదంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఎలాగైనా యాత్రను సక్సెస్ చేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news