అందుకే పార్టీ మారాను – ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కీలక వ్యాఖ్యలు

-

నల్లగొండ జిల్లా నకిరేకల్ లో గొర్రెల పంపిని కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. మూడోసారి తనని ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. కెసిఆర్ గెలుపు మేరకు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని అన్నారు.

 

తనని నియోజకవర్గం అభివృద్ధి చేయమని గెలిపించారని.. అందుకే పార్టీ మారినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. కానీ స్వార్థం కోసం పార్టీ మారలేదన్నారు. మళ్లీ పార్టీ మారే అవకాశం లేదని… ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్, కేటీఆర్ తోనే కలిసి నడుస్తానన్నారు. అందరి దీవెనలు తనకి ఉండాలని కోరారు. ఎన్నికలు వచ్చినప్పుడు కొందరు దుర్మార్గులు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారని.. అలాంటి వ్యక్తులకు మరోసారి అవకాశం ఇవ్వకుండా, రాకుండా చూసుకోవాలన్నారు. తన హయాంలో నియోజకవర్గ ప్రశాంతంగా ఉందని.. పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news