రాహుల్ గాంధీని కాదు…కాంగ్రెస్ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేవు మోడీ -రేవంత్ రెడ్డి

-

రాహుల్ గాంధీని కాదు…కాంగ్రెస్ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేవు మోడీ అంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. Ed బీజేపీ… ఎన్నికల డిపార్ట్ మెంట్ గా మారింది…ఎన్నికలు వస్తె ed తో అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. పెట్రోల్ డీజిల్ ధరలు..నిత్యావసర ధరలు పెరిగాయి…వీటిని అడిగితే… రాహుల్ గాంధీకి ed నోటీసులు ఇచ్చారన్నారు.

సోనియా గాంధీ ed ఆఫీస్ లో అడుగు పెట్టిన క్షణం మోడీ ప్రభుత్వం పతనం అవుతోందని….దుర్మార్గ ఆలోచన మానుకోవాలని హితవు పలికారు.మోడీ ఉడత ఊపులకు ఇక్కడ ఎవడు బయపడడని.. పెంచిన ధరలు తగ్గించు… ఇస్తా అన్నా ఉద్యోగాలు ఇవ్వు అని మోడీని నిలదీశారు. స్విస్ బ్యాంక్ నుండి వేల కోట్లు తెస్తా అన్నావు… ఏమైంది…? అని నిలదీశారు.

నాలుగేళ్లు సైన్యంలో.. ఆ తరువాత జీవితకాలం బడా పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా? అని ప్రశ్నించారు. నాలుగేళ్ల తర్వాత వాళ్లకు పిల్లను ఎవరు ఇస్తారు, పెళ్లి ఎలా అవుతుందని ప్రశ్నించారు. మాజీ సైనిక హోదా కూడా ఇవ్వకపోతే ఎలా అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news