విరాట్ కోహ్లీ ఆటపై సజ్జనార్ సంచలన ట్వీట్ !

-

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఆర్టీసీ ఎండీగా… సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లారు ఎండీ సజ్జనార్‌. దీంతో పాటు సంస్థను ప్రమోట్ చేయడానికి ఎప్పటికప్పుడు పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు సజ్జనార్.

ఈ నేపథ్యంలోనే తాజాగా… రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆటపై ట్వీట్‌ చేశారు. విరాట్‌ కోహ్లీ ఫోటో వాడుకుని..ఆర్టీసీ క్రేజ్‌ పెంచే ప్రయత్నం చేశారు సజ్జనార్‌. బస్‌ కండక్టర్‌.. ఎప్పుడైన.. పాస్‌ అడిగినప్పుడు.. ఇంట్లో మరిచిపోయాం అని చాలా మంది చెబుతారు. అచ్చం అలాగే.. విరాట్‌ కోహ్లీ ఎక్స్‌ ప్రెషన్స్‌ పెట్టాడని ట్వీట్‌ చేశారు. అలాగే.. మీరు ఎప్పుడైనా.. పాస్‌ మరిచిపోయి.. బస్సు ఎక్కరా అని ప్రశ్నించాడు. ఈ మేరకు కోహ్లీ ఫోటో ట్యాగ్‌ చేశాడు సజ్జనార్‌. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news