ఆమరణ నిరాహార దీక్షకు దిగిన శేజల్

-

బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తున్న ఆరిజిన్ డైరీ సంస్థ నిర్వాహకురాలు బోడపాటి శేజల్ దేశ రాజధాని ఢిల్లీలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగింది. గత కొద్ది రోజులుగా ప్రతిరోజు వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేపడుతున్న శేజల్ దుర్గం చిన్నయ్య పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నేడు ఆమరణ నిరాహార దీక్షకు దిగింది. సిబిఐ, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు చిన్నయ్య పై ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

ఇక తెలంగాణ డిజిపి కి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చి 14 రోజులైనా స్పందించడం లేదని శేజల్ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగే వరకూ దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేసింది. ఆడపిల్లల వైపు అసభ్యంగా చూస్తే గుడ్లు పీకుతానన్న కేసీఆర్ తన ఆవేదనని అర్థం చేసుకోవడం లేదని, ఆడపిల్లకి జరిగిన అన్యాయం గురించి కనీసం పట్టించుకోవడంలేదని నిరసన తెలియజేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news