BREAKING : మే 2న ఢిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్

-

BREAKING : ఢిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్ పయనం కానున్నారు. ఆరు నెలల విరామం తర్వాత మే 2న సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. మూడు, నాలుగు రోజుల పాటు అక్కడే ఉండనున్న కేసీఆర్ జాతీయ రాజకీయాలపై అందుబాటులో ఉన్న జాతీయ నేతలను కలిసి చర్చించనున్నారు.

4న ఢిల్లీలోని వసంత విహార్ లో నిర్మించిన BRS జాతీయ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. కెసిఆర్ తాజా టూర్ లో ఎవరెవరిని కలుస్తారు? ఏం చర్చిస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది.కాగా, brs ఎమ్మెల్యేల పని తీరు సక్రమంగా లేదని.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందని అలాంటి వాళ్లంతా వారి తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిన్న ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా దళితబంధు పథకం అమలు అంశంపై ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత పార్టీ ఎమ్మెల్యేలను గట్టిగా హెచ్చరించారు. పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version