హైదరాబాద్ వాసులకు శుభవార్త..468 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభం

-

హైదరాబాద్ వాసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇవాళ హైదరాబాద్ లోని ఓల్డ్ మారేడ్పల్లి లో పేదల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన… 468 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రి తలసాని, మహమూద్ ఆలీ, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… మారేడు పల్లి లో 36 కోట్లతో నిర్మించిన 468 ఇండ్లను ఇవ్వాళ ప్రారంభించి ఉన్నామని తెలిపారు.

నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకల ఇల్లు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఆనందం చూస్తుంటే… కడుపునిండిన అంత సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు. మీ అందరినీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోటీశ్వరులను చేశారని పేర్కొన్నారు. ఈ ఇండ్లను అమ్మే ప్రసక్తి లేదని.. ఈ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత మీదేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకువస్తామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news