తెలంగాణలో ఆగని కరోనా జోరు.. కొత్తగా ఎన్ని కేసులంటే..!

-

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 2,273 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 12 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,260 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,62,844 కి చేరింది. వీరిలో ఇప్పటివరకు మొత్తం 1,31,447 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 996 కు చేరింది.

ప్రస్తుతం ఆసుపత్రుల్లో 30,401 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన మరో 23,569 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యశాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. అయితే కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో అధికంగా 325 కేసులు నమోదు అయ్యాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో 55,636 టెస్టులు జరగగా.. ఇప్పటి వరకు 22,76,222 టెస్టులు జరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news