సికింద్రాబాద్ అగ్నిప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం

-

సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించినట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు.

సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో గతరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురు సోమవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరొకరు ఇవాళ ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఇవాళ ఉదయం హోంమంత్రి మహమూద్ అలీ మరోసారి ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లాడ్జిలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు యాక్టివేట్ అయ్యే స్ప్రింకర్లు ఉన్నాయని అవి కేవలం మంటలు చెలరేగినప్పుడే ఆన్ అవుతాయని.. నిన్నటి ఘటనలో దట్టమైన పొగ అలుముకోవడం వల్లే మరణాలు సంభవించాయని అధికారులు మంత్రికి వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news