సీఎం కేసీఆర్ పై తెలంగాణ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..నన్నెవరూ నియంత్రించలేరు..!

-

ప్రగతి భవన్‌, గవర్నర్‌ భవన్‌ మధ్య రోజు రోజు దూరం పెరుగుతూనే ఉంది. నిన్న ఉగాది ఉత్సవాలు గవర్నర్‌ భవన్‌ లో జరిగాయి. అయితే.. ఈ కార్యక్రమానికి.. సీఎం కేసీఆర్‌ ను తెలంగాణ గవర్నర్‌ తమిళ్‌ సై ఆహ్వానించారు. కానీ.. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ వెళ్లలేదు. దీంతో మరోసారి వారి మధ్య విభేధాలు బయట పడ్డాయి. అయితే..దీనిపై గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నా ఇన్విటేషన్‌ని గౌరవించనందకు బాధపడడంలేదు.. 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించాను.. కొందరు వచ్చారు.. రాని వారి గురించి చెప్పేదేమీలేదని పేర్కొన్నారు.

నన్ను ప్రగతిభవన్‌లో ఉగాది కార్యక్రమానికి ఆహ్వానించి ఉంటే ప్రొటోకాల్‌ పక్కన పెట్టి అటెండ్‌ అయ్యేదాన్ని.. యాదాద్రికి వెళ్లాలనుకున్నా.. కానీ, నన్ను ఆహ్వానించలేదు.. నేను వివాదాస్పదం చేసే వ్యక్తిని కాదు.. గ్యాప్‌ని సృష్టించే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కొన్ని అంశాలపై డిఫరెన్స్‌స్‌ ఉన్నాయి.. ఎన్నిసార్లు ఆహ్వానాలను పంపినా పట్టించుకోవడంలేదని గవర్నర్‌ తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news