తెలంగాణ విద్యార్థులకు అలర్ట్‌.. నేడే లాసెట్‌ ఫలితాలు

-

తెలంగాణలో ఇటీవల లాసెట్‌ రాసిన విద్యార్థులకు బిగ్ అలెర్ట.. ఇవాళ టీఎస్ లాసెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2022 రిజల్ట్స్ ను ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వీ. వెంకట రమణ, ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ. రవీందర్, ప్రొ.లింబాద్రి విడుదల చేయనున్నారు.

రిజల్ట్స్ ను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కాగా ఈ ఏడాది జరిగిన లాసెట్‌ పరీక్షలకు మొత్తం 35,538 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 28,921 మంది జులై 21, 22 తేదీల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ప్రవేశ పరీక్షల్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా మూడేళ్ల, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు అధికారులు

Read more RELATED
Recommended to you

Latest news